ఫరూఖ్ అబ్దుల్లాపై దావా వేయనున్న వైసీపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై పరువు నష్టం దావా వేస్తామని [more]

Update: 2019-03-27 09:41 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై పరువు నష్టం దావా వేస్తామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిన్న చంద్రబాబు తరపున ప్రచారానికి కడప వచ్చిన ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పదవి ఇప్పిస్తే రూ.1500 కోట్లు ఇస్తానని జగన్ చెప్పారని ఆరోపించారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… అసలు కాంగ్రెస్ పార్టీకే సంబంధం లేని ఫరూక్ అబ్దుల్లా వద్దకు జగన్ ఎందుకు పోతారని ప్రశ్నించారు. జగన్ తొందరపడి వెళ్లిపోయారని, కాంగ్రెస్ లోనే ఉంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాళ్లమని కాంగ్రెస్ పెద్దలే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుకు, ఫరూక్ అబ్దుల్లాకు మధ్య ఏ లావాదేవీలు ఉన్నాయో తెలియదని, తాము మాత్రం అబద్ధపు ఆరోపణలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News