నేత‌ల‌కు క్లాస్ ఇప్పిస్తున్న వైసీపీ

ఎన్నిక‌ల కౌంటింగ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌రింత అలెర్ట్ అయ్యింది. కౌంటింగ్ రోజు పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు, అభ్య‌ర్థులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఇవాళ విజ‌య‌వాడ‌లో [more]

Update: 2019-05-16 06:48 GMT

ఎన్నిక‌ల కౌంటింగ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌రింత అలెర్ట్ అయ్యింది. కౌంటింగ్ రోజు పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు, అభ్య‌ర్థులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఇవాళ విజ‌య‌వాడ‌లో శిక్ష‌ణ ఇస్తున్నారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థులు, పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లాం, విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై వైసీపీ ఏజెంట్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. పార్టీ ముఖ్య‌నేత‌లు విజ‌య‌సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు కూడా ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మానికి హాజ‌రై పార్టీ శ్రేణుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. కౌంటింగ్ రోజు ఏయే అంశాల‌పై ఏజెంట్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలో, ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో వీరి శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

Tags:    

Similar News