వైసీపీని విలీనం చేస్తున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు గానూ విజయసాయిరెడ్డి బీజేపీతో చర్చలు జరుపుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. మే 23 [more]

Update: 2019-04-27 06:26 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు గానూ విజయసాయిరెడ్డి బీజేపీతో చర్చలు జరుపుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. మే 23 తర్వాత వైసీపీ మూతపడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నరేంద్ర మోడీ, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ భాగస్వామి అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమీక్షలు చేయవచ్చని అన్నారు. తుఫాన్ వస్తుంటే ముఖ్యమంత్రి సమీక్ష చేయకుండా అడ్డుకోవడం దారుణమని ఆరోపించారు.

Tags:    

Similar News