చంద్రబాబు మాటలు వింటే అసహ్యం వేస్తోంది

తమ మనుషులను తామే చంపుకున్నామని నీచంగా మాట్లాడుతున్న చంద్రబాబును చూస్తే అసహ్యం వేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ… కేవలం [more]

Update: 2019-03-16 07:46 GMT

తమ మనుషులను తామే చంపుకున్నామని నీచంగా మాట్లాడుతున్న చంద్రబాబును చూస్తే అసహ్యం వేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ… కేవలం ఎన్నికల వేళ జగన్ తో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే కుట్రతోనే హత్య చేశారన్నారు. పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గించడంతో పాటు కడప పార్లమెంటు, జమ్మలమడుగు స్థానాన్ని దక్కించుకోవాలనే కుట్రతోనే వివేకాను హత్య చేశారని తాము భావిస్తున్నామని తెలిపారు. ఈ హత్య వెనుక చంద్రబాబు సూత్రధారి అని ఆయన ఆరోపించారు. సిట్ వల్ల తమకు న్యాయం జరగదని, ఐదేళ్లుగా అనేక కేసుల్లో సిట్ వేసి కేసులను నీరు గార్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేయకపోతే సీబీఐ లేదా థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News