కేసు చివరి దశలో ఉంది

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ విచారణ దాదాపు పూర్తి అయిందని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వేసిన [more]

Update: 2020-02-20 11:49 GMT

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ విచారణ దాదాపు పూర్తి అయిందని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వేసిన నాలుగు పిటీషన్లపై విచారణ సందర్భంగా ఏజీ ఈ వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో అందజేశారు. సిట్ విచారణ తుది దశలో ఉందని, సీబీఐ కి అప్పగించాల్సిన అవసరం లేదని ఏజీ న్యాయమూర్తికి వివరించారు. ఇప్పటి వరకూ జరిపిన విచారణ, సాక్ష్యాల సేకరణ కవర్ లో అందించారు. కేసు జనరల్ డైరీని వచ్చే సోమవారానికి కోర్టుకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Tags:    

Similar News