కేసీఆర్ పై షర్మిల సూటి విమర్శలు

సొంత జిల్లా మెదక్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. షర్మిల మెదక్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్ సొంత జిల్లా అయిన [more]

Update: 2021-04-01 01:12 GMT

సొంత జిల్లా మెదక్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. షర్మిల మెదక్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ లో 20 కరువు మండలాలున్నాయని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఏ రకంగా అభివృద్ధి చెందాలి? ఆయన ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా 20 కరవు మండలాలు ఉండటం సిగ్గుచేటని షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే మెదక్ జిల్లా రూపురేఖలే మారిపోయేవని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు కూడా ఇంకా పరిహారం అందలేదని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News