అక్కగా వచ్చా …సమాజాన్ని బాగు చేద్దామనే

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తులు ముమ్మరం చేశారు. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్ [more]

Update: 2021-02-24 07:04 GMT

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తులు ముమ్మరం చేశారు. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం వల్ల ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలను దక్కించుకున్నారన్నారు. సమాజాన్ని బాగు చేయడానికే ఒక అక్కగా మీ ముందుకు వచ్చానని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను అమలు చేయడానికే తాను ముందుకు వచ్చానని, ఇందులో తనకెలాంటి స్వార్థం లేదని వైఎస్ షర్మిల చెప్పారు. యువత ఆలోచించి తమ భవిష్యత్ ను మెరుగుపర్చుకోవాలంటే సరైన దిశగా పయనించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

Tags:    

Similar News