సింహం సింగిల్ గా వస్తుంది.. పొత్తుల్లేవ్

సింహం సింగిల్ గా వస్తుందని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు అవసరం లేవని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె గుంటూరు నగరంలో జరిగిన రోడ్ [more]

Update: 2019-03-30 07:26 GMT

సింహం సింగిల్ గా వస్తుందని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు అవసరం లేవని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె గుంటూరు నగరంలో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతూ… బీజేపీతో ఇంతకాలం పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో తమకు పొత్తుందని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. మూడు నెలల క్రితం హరికృష్ణ మృతదేహం పక్కన కేటీఆర్ తో పొత్తు కోసం చర్చలు జరిపిన చంద్రబాబు తమకు కేసీఆర్ తో పొత్తు ఉందని ఆరోపిస్తున్నారని అన్నారు. తమకు ఎవరి పొత్తూ అవసరం లేదని, బంపర్ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందని అన్ని సర్వేలూ చెబుతున్నాయన్నారు.

ఏ హామీ పూర్తి చేయకుండా….

650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వని చంద్రబాబు వర్ధంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్ కు మూడు శాఖలకు మంత్రిని చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ మీ భవిష్యత్ నా బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారని, అంటే గత ఐదేళ్లు ప్రజల భవిష్యత్ ఆయన బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం చంద్రబాబు చెప్పే మాటలను నమ్మొదన్నారు. చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లు ఇప్పుడు ఓట్ల కోసం పింఛన్లు పెంచుతున్నారని అన్నారు.

Tags:    

Similar News