జగన్ ఫుల్లుగా శాటిస్ఫై అయ్యారట

పీపీఏలపై రివ్యూ చేయకపోతే విద్యుత్తు సంస్థలు బతికి బట్టగట్టలేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పీపీఏల విషయంలో కూడా విప్లవాత్మక చర్యలు చేపట్టాలని వైఎస్ [more]

Update: 2019-09-25 09:45 GMT

పీపీఏలపై రివ్యూ చేయకపోతే విద్యుత్తు సంస్థలు బతికి బట్టగట్టలేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పీపీఏల విషయంలో కూడా విప్లవాత్మక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.లేకుంటే డిస్కంలు మనుగడ సాగించలేవని చెప్పారు. విద్యుత్తు ఛార్జీలు రాష్ట్రంలో ఎక్కువగా ఉండటంతో పరిశ్రమల స్థాపనకు కూడా ఎవరూ ముందుకు రారనిచెప్పారు. అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ పై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 782 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించినట్లయిందనిచెప్పారు. వందకోట్లు దాటిన ప్రతి టెండర్ నూ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. పారదర్శక విధానాలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు.

Tags:    

Similar News