రెండు రోజులు ఢిల్లీలోనే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం పదిగంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 12గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఈరోజు, రేపు జగన్ [more]

Update: 2019-10-21 01:45 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం పదిగంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 12గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఈరోజు, రేపు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించనున్నారు. ఈరోజు రాత్రికి జగన్ ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖకు చేరుకుంటారు. అక్కడ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్ లో జగన్ పాల్గొంటారు.

Tags:    

Similar News