వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లు కూడా రావు

టీడీపీ తప్పుడు ప్రచారం చేయడంలో ముందుంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లు కూడా చంద్రబాబుకు రావని చెప్పారు. 2018 కి సంబంధించి [more]

Update: 2020-12-01 05:11 GMT

టీడీపీ తప్పుడు ప్రచారం చేయడంలో ముందుంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లు కూడా చంద్రబాబుకు రావని చెప్పారు. 2018 కి సంబంధించి 415 కోట్ల రూపాయలను బీమా సొమ్మును చెల్లించామని వైఎస్ జగన్ తెలిపారు. కావాలని బీమా ప్రీమియం చెల్లించలేదని టీడీపీ బురద చల్లుతుందన్నారు. తిరిగి డిసెంబరు 15వ తేదీన 1275 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని చెప్పారు. 2018 లో చంద్రబాబు హయాంలో బీమా ప్రీమియం సక్రమంగా చెల్లించలేదన్నారు. బాబు హయాంలో రైతులు బీమా తీసుకోడానికే భయపడేవారు. అప్పుుడు బీమా ప్రీమియం ఎక్కువగా ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీమియం తగ్గించామని, అందుకే 58 లక్షల మంది రైతులు ఇప్పుడు బీమా పరిధిలోకి వస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News