నేడు జగనన్న తోడు పథకం ప్రారంభం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చిరు వ్యాపారులకు పదివేల వడ్డీ లేని రుణాన్ని నేడు జగన్ అందజేయనున్నారు. చిరు వ్యాపారులు తమ [more]

Update: 2020-11-25 02:47 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చిరు వ్యాపారులకు పదివేల వడ్డీ లేని రుణాన్ని నేడు జగన్ అందజేయనున్నారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. దీంతో వారి ఆదాయం సగం వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంది. తన పాదయాత్రలో గమనించిన జగన్ చిరు వ్యాపారులను ఆదుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జగనన్న తోడు పథకాన్ని నేడు ప్రారంభంచనున్నారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందచేయనున్నారు. మొత్తం 9.05 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. ఇందుకోసం 905 కోట్ల రూపాయలను ఆన్ లైన్ ద్వారా జగన్ విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News