సోమశిల రెండోదశకు నేడు జగన్

సోమశిల రెండో దశ పనులకు నేడు శంకుస్థాపన జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. సోమశిల హైలెవెల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశపనులు [more]

Update: 2020-11-09 02:23 GMT

సోమశిల రెండో దశ పనులకు నేడు శంకుస్థాపన జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. సోమశిల హైలెవెల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశపనులు పూర్తయితే దాదాపు 46,453 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రధానంగా మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల రైతాంగానికి మేలు చేకూరుతుంది. ఇందుకు 840 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. వర్చువల్ విధానంలో నేడు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

Tags:    

Similar News