స్నేహం స్నేహమే.. రాష్ట్రం రాష్ట్రమే

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ విభజన చట్టానికి అనుకూలంగానే చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. త్వరలో జరిగే అపెక్స్ [more]

Update: 2020-08-13 02:18 GMT

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ విభజన చట్టానికి అనుకూలంగానే చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. త్వరలో జరిగే అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ తరుపున వాదనలను బలంగా వినిపిద్దామని చెప్పారు. జగన్ నీటిపారుదల శాఖపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కృష్ణా నదీ బోర్డు యాజమాన్యం ఇచ్చిన నీటి కేటాయింపులకు అనుగుణంగానే ఏపీ నీళ్లను వాడుకుంటుందన్నారు. వరదలు వచ్చిన సమయంలోనే మిగులు జలాలను వాడుకోవాలన్న లక్ష్యంతో పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచుతున్నామన్నారు. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను లైట్ గా తీసుకోమని జగన్ అధికారులకు చెప్పారు. తనకు పొరుగు రాష్ట్రంతో స్నేహం కొనసాగించాలనే ఉంటుందని, అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని జగన్ చెప్పారు.

Tags:    

Similar News