విశాఖ ముహూర్తం ఎప్పుడంటే?

మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడంతో పరిపాలన రాజధానిని సాధ్యమయినంత త్వరగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి జగన్ విశాఖలో భూమి [more]

Update: 2020-08-01 02:39 GMT

మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడంతో పరిపాలన రాజధానిని సాధ్యమయినంత త్వరగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి జగన్ విశాఖలో భూమి పూజ చేస్తారని సమాచారం. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను కూడా విశాఖలోనే నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరోజు నుంచే సీఎం క్యాంప్ కార్యాలయం విశాఖలో ఏర్పాటు అయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంవో తో పాటు ముఖ్యమైన శాఖల హెచ్ ఓడీ కార్యాలయాలను కూడా విశాఖకు తరలించనున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా సచివాలయాన్ని తరలించాలన్న ఉద్దేశ్యంలో ప్రభుత్వం ఉంది.

Tags:    

Similar News