కేంద్రానికి జగన్ లేఖ. మరో మూడు నెలలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని ఏపీ సీఎం వైెెఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు. నీలం [more]

Update: 2020-07-29 02:07 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని ఏపీ సీఎం వైెెఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు. నీలం సాహ్ని పదవీ కాలాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకసారి పొడిగించింది. నిజానికి నీలం సాహ్ని జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం సెప్టంబరు వరకూ పొడిగించింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మరో మూడు నెలలు పొడిగించాలని జగన్ మరో మారు కేంద్రానికి లేఖ రాశారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News