జగన్ కేసు వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు డిసెంబరుకు వాయిదా పడింది. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ కోర్టు విచారిస్తున్న సంగతి [more]

Update: 2019-11-22 06:18 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు డిసెంబరుకు వాయిదా పడింది. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. అధికార పర్యటనలో ఉన్నందున హాజరు నుంచి జగన్ మిన‍హాయింపు కోరారు. దీంతో ఈ కేసును వచ్చే నెల 6వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. పార్లమెంటు సమావేశాలున్నందున విజయసాయిరెడ్డి కూడా హాజరు కాలేదు.

Tags:    

Similar News