నిన్న ఇవ్వలేకపోయారు.. నేడు గ్యారంటీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమీక్ష చేయనున్నారు. నేడు విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారి కుటుంబానికి కోటి రూపాయల [more]

Update: 2020-05-11 03:04 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమీక్ష చేయనున్నారు. నేడు విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో ఇవ్వనున్నారు. అయితే ఇంకా ప్రజలను పునరావాస కేంద్రాల్లోనే ఉంచారు. నిపుణులు చెప్పిన తర్వాతనే ప్రజలను గ్రామాల్లోకి అనుమతించనున్నారు. కానీ నిన్ననే పరిహారం చెల్లించాల్సి ఉన్నా కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ జారీలో జాప్యం జరగడంతో పరిహారం చెల్లించలేకపోయారు. నేడు వెంటిలేటర్ పై ఉన్న వారి కుటుంబాలకు కూడా నేడు పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు, మంత్రులతో జగన్ మాట్లాడనున్నారు.

Tags:    

Similar News