బ్రేకింగ్ : జగన్ మరో సంచలన నిర్ణయం.. వారికి భారీ ఊరట

చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నుంచి పరిశ్రమలను కాపాడేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 [more]

Update: 2020-04-30 14:26 GMT

చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నుంచి పరిశ్రమలను కాపాడేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ ఉన్న బకాయీలను వారికి చెల్లించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే నెలలో కొంతమొత్తం, జూన్ నెలలో మిగిలిన మొత్తం చెల్లించాలని జగన్ అధికారులను ఆదేశించారు. వారికి విద్యుత్తు ఛార్జీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 185 కోట్ల విద్యుత్తు బకాయిలను చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రద్దు చేసింది. కరోనా నుంచి కాపాడేందుకు ఆర్థిక రక్షణ ప్రణాళిక రచంచారు. మొత్తం 905 కోట్లను ఇవ్వాలని నిర్ణయించారు.

Tags:    

Similar News