గవర్నర్ తో జగన్ భేటీ.. కారణమిదే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, దానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా జగన్ [more]

Update: 2020-03-30 13:39 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, దానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా జగన్ గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మూడు నెలలకు సంబంధించి ఆర్డినెన్స్ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాలను కరోనా వైరస్ కారణంగా పెట్టలేకపోవడంతో మంత్రివర్గం ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. దీనికి గవర్నర్ ఓకే చెప్పాల్సి ఉంది. దీంతోపాటు లాక్ డౌన్ కారణంగా ప్రజలకు నిత్యావసరాల పంపిణీ వంటి విషయాలను కూడా జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

Tags:    

Similar News