ఎవరేమన్నా వెనకడుగు వేయను

ఇన్ని మంచిపనులు చేస్తున్నా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన చెందారు. చంద్రబాబుకు పత్రికలు, కొన్ని ఛానెళ్లు తోడయ్యాయన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని తాము అనుకుంటే [more]

Update: 2020-02-24 07:30 GMT

ఇన్ని మంచిపనులు చేస్తున్నా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన చెందారు. చంద్రబాబుకు పత్రికలు, కొన్ని ఛానెళ్లు తోడయ్యాయన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని తాము అనుకుంటే దాడులు చేస్తున్న వారిని ఏమనాలని జగన్ ప్రశ్నించారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబును ప్రజలు మర్చిపోతారనే ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. ఏ తప్పు చేయకపోయినా నిరాధార వార్తలు రాస్తున్నారన్నారు. అయితే ఎంతమంది ఎన్ని చేసినా తాను ముందడుగు వేస్తానని జగన్ తెలిపారు. డబ్బులు ఇచ్చి మరీ వ్యతిరేక కథనాలను రాయిస్తున్నారని జగన్ మండి పడ్డారు. అయితే ప్రజల దీవెన ఉన్నంత వరకూ ఏ అంశంలోనూ తాను వెనకడుగు వేయనని జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది ప్రతిపక్షం కాదని, రాక్షసులని ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెనను ప్రారంభించిన జగన్ అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

Tags:    

Similar News