మారిన జగన్ షెడ్యూల్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ షెడ్యూల్ మారింది. ఈరోజు కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ ఉండటంతో సాయంత్రం వరకూ జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు 12గంటలకు కేంద్ర [more]

Update: 2020-02-15 05:23 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ షెడ్యూల్ మారింది. ఈరోజు కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ ఉండటంతో సాయంత్రం వరకూ జగన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు 12గంటలకు కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ను జగన్ కలవనున్నారు. ఆయనతో మండలి రద్దు, హైకోర్టు తరలింపు వంటి అంశాలను చర్చించనున్నారు. నిన్న అమిత్ షాతో జరిగిన భేటీలోనూ ఈ రెండు ప్రధాన అంశాలుగా జగన్ షాతో చర్చించినట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులపై చర్చించేందుకు మరికొంత మంది కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు.

Tags:    

Similar News