కర్ఫ్యూ అమలులో ఉన్నా ఏ పనులూ ఆపకూడదు

కర్ఫ్యూ అమలులో ఉన్నా అభివృద్ధి పనులు ఏవీ ఆపకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై జగన్ అధికారులతో [more]

Update: 2021-05-06 01:14 GMT

కర్ఫ్యూ అమలులో ఉన్నా అభివృద్ధి పనులు ఏవీ ఆపకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై జగన్ అధికారులతో సమీక్షించారు. జూన్ 1 నుంచి జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ మామూలుగా కార్యక్రమాలను నడపాలని జగన్ ఆదేశించారు. జగనన్న కాలనీల్లో నీటి సదుపాయం, రహదారులు, విద్యుత్తు సరఫరా వంటి వసతులను కల్పించాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థకు వృద్ధి అని జగన్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News