అది నినాదం కాదు…. తమ విధానం

రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల ఖాతాల్లో జగన్ నగదును జమ చేశారు. [more]

Update: 2021-04-23 06:09 GMT

రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల ఖాతాల్లో జగన్ నగదును జమ చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై రెండో ఏడాదిగా కూడా వడ్డీ సొమ్మును జగన్ వారి ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 8.71 లక్షల పొదుపు సంఘాలకు 1,109 కోట్ల రూపాయలను జగన్ వారి ఖాతాల్లో జమ చేశారు. దీనివల్ల 1.02 కోట్ల మంది లబ్ది పొందుతున్నారు. మహిళా సాధికారిత తమ నినాదం కాదని, తమ విధానం అని వైఎస్ జగన్ అన్నారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ వెల్లడించారు.

Tags:    

Similar News