నేడు 670 కోట్లను లబ్దిదాదారుల ఖాతాల్లో జమ చేయనున్న జగన్

జగనన్న విద్యాపథకం కింద నేడు లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ప్రయివేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లించనుంది. అయితే కళాశాలలకు జమ చేయకుండా [more]

Update: 2021-04-19 01:11 GMT

జగనన్న విద్యాపథకం కింద నేడు లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ప్రయివేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లించనుంది. అయితే కళాశాలలకు జమ చేయకుండా నేరుగా విద్యార్థుల తల్లి ఖాతాలోనే నగదును జమ చేయనుంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద ఈ పథకాన్ని జగన్ ప్రవేశపెట్టారు. ఈరోజు నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ ఆర్థిక శాఖ 670 కోట్ల నిధులను విడుదల చేసింది.

Tags:    

Similar News