ఎన్వీ రమణపై జగన్ ఆరోపణలను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు

గత ఏడాది అక్టోబర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధాని భూముల కొనుగోళ్లలో ఎన్వీ రమణ కుటుంబ [more]

Update: 2021-03-25 01:17 GMT

గత ఏడాది అక్టోబర్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధాని భూముల కొనుగోళ్లలో ఎన్వీ రమణ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని జగన్ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై అంతర్గతంగా విచారించిన సుప్రీంకోర్టు ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. అంతర్గత విచారణ చేయడంతో దాని వివరాలను బయటపెట్టలేదు. విచారణలో ఏమీ తేలకపోవడం వల్లనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే రాష్ట్రపతికి ఎన్వీ రమణ పేరు సిఫార్సు చేసింది. ఎన్వీరమణ పేరు సిఫార్సు చేయడంతోనే జగన్ ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్లయింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలయింది.

Tags:    

Similar News