ముఖ్యమంత్రి జగన్ కు ఆహ్వానం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు ఈవో రామారావు కలసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. మార్చి 4వ [more]

Update: 2021-02-27 01:51 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు ఈవో రామారావు కలసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. మార్చి 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆహ్వానం పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ కు అందజేసిన వారిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఉన్నారు.

Tags:    

Similar News