అసెంబ్లీలో తీర్మానం చేసి తీరతాం

పోస్కో వాళ్లు విశాఖ రావడం, తనను కలవడం నిజమేనని జగన్ తెలిపారు. అయితే కడప, కృష్ణపట్నం, భావనాపాడులో స్టీల్ ప్లాంట్ ను నిర్మించమని తాను చెప్పానని అన్నారు. [more]

Update: 2021-02-18 00:47 GMT

పోస్కో వాళ్లు విశాఖ రావడం, తనను కలవడం నిజమేనని జగన్ తెలిపారు. అయితే కడప, కృష్ణపట్నం, భావనాపాడులో స్టీల్ ప్లాంట్ ను నిర్మించమని తాను చెప్పానని అన్నారు. తాను ఇదివరకే ప్రధానికి లేఖ రాశానని, సానుకూల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నానని జగన్ తెలపిారు. విశాఖ కార్మికులతో జగన్ ఎయిర్ పోర్టులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలోనే తాము అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.

Tags:    

Similar News