నేడు జగన్ చేతుల మీదుగా మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలను జగన్ ప్రారంభంచనున్నారు. ఇందుకోసం 9,290 వాహనాలను [more]

Update: 2021-01-21 01:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలను జగన్ ప్రారంభంచనున్నారు. ఇందుకోసం 9,290 వాహనాలను సిద్దం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యాన్ని ఇంటింటికి ఈ వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో నేడు జగన్ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను జెండా ఊపి ప్రారంభంచనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొననున్నారు.

Tags:    

Similar News