అమిత్ షాతో జగన్…ప్రధానంగా దానిమీదే?

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలసి దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. ప్రధానంగా మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రస్తావించినట్లు [more]

Update: 2021-01-20 01:12 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలసి దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. ప్రధానంగా మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రస్తావించినట్లు తెలిసింది. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేయాలని, హైకోర్టుకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందదర్భంగా జగన్ అమిత్ షాను కోరినట్లు సమాచారం. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల మధ్య అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 1,644 కోట్ల రూపాయలను విడుదల చేయాలని జగన్ కోరారు. రెవెన్యూ లోటును కూడా భర్తీ చేయాలని జగన్ అమిత్ షాను కోరినట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా జగన్ అమిత్ షా కు వివరించారు.

Tags:    

Similar News