నేడు ఏలూరుకు జగన్…… వారికి పరామర్శ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏలూరు వెళ్లనున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించనున్నారు. తర్వాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో [more]

Update: 2020-12-07 02:18 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏలూరు వెళ్లనున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించనున్నారు. తర్వాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జగన్ అధికారులతో సమావేశం అవుతారు. ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో అనేక మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అస్వస్థతకు గల కారణాలపై ఇప్పటికే వైద్య బృందాలు విచారణను ప్రారంభించాయి. ఎయిమ్స్ నుంచి కూడా ప్ర్రత్యేక వైద్య బృందం ఏలూరుకు చేరుకుంది. జగన్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత అధికారులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే 350 మంది అస్వస్థతకు గురయ్యారు.

Tags:    

Similar News