నా డ్రీమ్ అదే

తన డ్రీమ్ లంచాలు లేని పాలన అందిచాలన్నదేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. డల్లాస్ లో ఆయన తెలుగు వారితో మాట్లాడారు. పల్లెలన్నీ [more]

Update: 2019-08-19 02:49 GMT

తన డ్రీమ్ లంచాలు లేని పాలన అందిచాలన్నదేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. డల్లాస్ లో ఆయన తెలుగు వారితో మాట్లాడారు. పల్లెలన్నీ బాగుపడాలన్నదే తన ఆశయమన్నారు. ఈ కలలన్నీ నిజం కావాలంటే మీ సహకారం కూడా అవసరమని వైఎస్ జగన్ చెప్పారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కు రావాలని జగన్ పిలుపునిచ్చారు. ఇది మీ ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. మీ గ్రామాలను దత్తత తీసుకుని ప్రభుత్వానికి చేయూతగా ఉండాలని కోరారు. ఇందుకోసం తమ ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ ను త్వరలోనే ప్రారంభిస్తుందని చెప్పారు.

Tags:    

Similar News