దేశం మొత్తం మనవైపు చూసేలా పాలిస్తా..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా తమకు విజయాన్ని ఇచ్చారని కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన [more]

Update: 2019-05-25 07:38 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా తమకు విజయాన్ని ఇచ్చారని కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం జగన్ మాట్లాడుతూ… ప్రజలు ఎంతో విశ్వాసంతో తమను గెలిపించారని, ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనుకునేలా పాలిస్తానన్నారు. పరిపాలనను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పాలన ఉంటుందన్నారు. ఇందుకు ఎమ్మెల్యేల సహకారం తనకు అందివ్వాలని జగన్ కోరారు.

Tags:    

Similar News