వై.ఎస్ జగన్ కు అదిరిపోయే కానుక

Update: 2018-06-23 11:10 GMT

తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఓ అభిమాని అక్షరాలనే కానుకగా మలిచి అందజేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అన్నాబత్తుని కిషోర్ అనే యువకుడు జగన్ కి వీరాభామాని. ఆయన సోదరుడు అన్నాబత్తుని శివకుమార్ ప్రస్తుతం తెనాలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త. జగన్ చిత్రపటాన్ని గీసిన కిషోర్ ఈ చిత్రాన్ని జగన్ కి కానుకగా అందించారు. అయితే, జగన్ పాదయాత్ర ఇప్పటివరకు పూర్తిచేసుకున్న నియోజకవర్గాల పేర్లతో ఈ చిత్రాన్ని గీయడం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Similar News