అమెరికా నుంచి ఫోన్

అమెరికా వెళ్లిన జగన్ ఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీటమునిగాయి. దీంతో వేలాది మందిని [more]

Update: 2019-08-17 04:44 GMT

అమెరికా వెళ్లిన జగన్ ఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీటమునిగాయి. దీంతో వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జగన్ వరద పరిస్థితిపై భారీ నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ కు ఫోన్ చేశారు. వరద పరిస్థితిపై ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని జగన్ మంత్రిని ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు అందరూ సహాయక చర్యలపై సమీక్షించాలని జగన్ కోరారు.

Tags:    

Similar News