గంట సేపు భేటీలో?

దాదాపు గంటపాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర న్యాయ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా శాసనమండలి రద్దు, హైకోర్టు తరలింపు అంశంపై [more]

Update: 2020-02-15 08:41 GMT

దాదాపు గంటపాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర న్యాయ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా శాసనమండలి రద్దు, హైకోర్టు తరలింపు అంశంపై జగన్ చర్చించారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే న్యాయశాఖ చొరవ అవసరం. అందుకే ప్రత్యేకంగా జగన్ న్యాయశాఖ మంత్రితో సమావేశమయ్యారు. సమావేశం సంతృప్తికరంగా సాగిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా తెలిపారు.

Tags:    

Similar News