‘ఛలో ఢిల్లీ’ అంటున్న వైఎస్సార్ కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని భావిస్తోంది. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన [more]

Update: 2018-12-25 07:18 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని భావిస్తోంది. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఎల్లుండి ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించ తలపెట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు వీరి దీక్ష కొనసాగనుంది. ఏపీకి జరుగుతున్న అన్యాయం, ప్రత్యేక హోదా ఆకాంక్ష ఉద్యమ సెగ ఢిల్లీకి తాకాలనే లక్ష్యంతో వైసీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. వైసీపీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Tags:    

Similar News