ఎంపీల రాజీనామాలపై తేల్చేయనున్న స్పీకర్..?

Update: 2018-06-06 06:04 GMT

ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం మరోసారి లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహజన్ ను కలిశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరిరోజున వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరి రాజీనామాలపై వివరణ కోరేందుకు ఇప్పటికే ఒకసారి ఎంపీలను పిలిచిన స్పీకర్ చివరగా మరోసారి స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతో మంగళవారం వారు ఢిల్లీలో స్పీకర్ ను కలిసిన ఎంపీలు తమ రాజీనామాల భావోద్వేగంతో చేసినవి కావని, ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశామని తేల్చిచెప్పారు. తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని , రాజీనామాలను ఆమోదించాలని వారు స్పీకర్ ను కోరారు. దీంతో వీరి రాజీనామాలపై స్పీకర్ రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

Similar News