ఆ ఘనత చంద్రబాబుకే దక్కింది..!

అవినీతి, అప్పుల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో [more]

Update: 2019-05-02 06:59 GMT

అవినీతి, అప్పుల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశంలోనే ఏపీ అప్పుల్లో నెంబర్ వన్ గా ఉందని, రైతులకు తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉందని నాబార్డు చెప్పిందని గుర్తు చేశారు. ఐదేళ్లు ఉన్న అధికారాలను వినియోగించుకోలేని చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు మాత్రం అధికారాలు కావాలని, సమీక్షలు చేయాలని అంటున్నారని ఆరోపించారు. చేసిన అవినీతిపై సమీక్షల పేరిట ఆధారాలు తుడిచేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తే సీఎస్ అడ్డుకుంటున్నారని, అందుకే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబులా ప్రమాణస్వీకారం చేసిన రోజు వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని మాట్లాడలేదని అన్నారు. అత్యంత అసమర్థ వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. చంద్రబాబు ఎవరిని తిట్టమంటే వారిని తిట్టే కిరాయి మంత్రి సోమిరెడ్డి అని ఆరోపించారు. ఆయనకు వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News