జగన్ పై నమ్మకం ఉంది

వల్లభనేని వంశీ వైసీపీ అధినేత జగన్ ను కలవడంతో గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి పాలయిన [more]

Update: 2019-10-26 07:03 GMT

వల్లభనేని వంశీ వైసీపీ అధినేత జగన్ ను కలవడంతో గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి పాలయిన యార్లగడ్డ వెంకట్రావు నివాసం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ పరిపాలనలో వైసీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. చివరకు జగన్, భారతిపై కూడా కేసులు నమోదు చేశారన్నారు. తాను బ్రోకరేజి పనులు చేసి డబ్బులు సంపాదించలేదని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. తాను నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఓట్లను అడుక్కోలేదని చెప్పారు. జగన్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కేసులకు భయపడే వల్లభనేని వంశీ జగన్ ను కలసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News