జగన్ చెంతకు యార్లగడ్డ

ఏపీ హిందీ అకాడమీ ఛైర్మన్, ప్రముఖ సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. లోటస్ పాండ్ లోని [more]

Update: 2019-02-28 07:52 GMT

ఏపీ హిందీ అకాడమీ ఛైర్మన్, ప్రముఖ సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి యార్లగడ్డ జగన్ ను కలిశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన యార్లగడ్డ.. రాజ్యసభ సభ్యుడిగా కూడా గతంలో పనిచేశారు. చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తున్న ఆయన జగన్ ను కలవడం చర్చనీయాంశం అవుతోంది. అయితే, సినారేపై తాను రాసిన పుస్తకాన్ని అందజేయడానికే జగన్ ను కలిశానని యార్లగడ్డ చెప్పారు.

Tags:    

Similar News