జగన్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగన్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారన్నారు. ఎన్నికల కమిషన్ ఒక [more]

Update: 2021-01-25 06:03 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగన్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారన్నారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, నోటిఫికేషన్ విడుదల చేశాక ఎన్నికలు జరపాల్సిందేనని యనమల తెలిపారు. అయితే అధికారులు విధులు నిర్వహించకుండా జగన్ అడ్డుకుంటున్నారని యనమల ఆరోపించారు. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని చెప్పారు. రాజకీయ సంక్షోభం కూడా తలెత్తే అవకాశముందని యనమల చెప్పారు. ఇలా చేస్తే జగన్ రాజకీయంగా ఇబ్బంది పడతారని యనమల అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News