మాదే విజయమన్న యడ్డీ

Update: 2018-05-12 02:39 GMT

కర్ణాటక ఎన్నికల్లో విజయం తమదేనని బీజేపీ సీఎం అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. ఆయన కొద్దిసేపటి క్రితం షికారిపుర లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్ధరామయ్య సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని, ఈ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ఆయన తేల్చి చెప్పారు. కన్నడ నాట కాంగ్రెస్ జిమ్మిక్కులు చెల్లవన్నారు. పూర్తి స్థాయి మెజారిటీతో బీజేపీయే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని యడ్యూరప్ప అన్నారు.

Similar News