ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులాచనారోణి గుండెపోటుతో మృతిచెందారు. ఆమె అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో జన్మించిన సులోచనారాణి అనేక రచనలు చేశారు. ముఖ్యంగా ప్రేమకథలు రాయడంలో ఆమె దిట్ట. యద్దనపూడి నవలలు అనేకం సినిమాలుగా కూడా తీశారు. ఒకప్పుడు యద్దనపూడి చేతి నుంచి నవల వస్తుందంటే మహిళలు ఆసక్తిగా ఎదురు చూసేవారు.