ఆ ఇద్దరు మంత్రులపై జగన్...?

Update: 2018-07-25 13:09 GMT

మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడికే పోలవరం కాంట్రాక్టులు ఇచ్చారని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకోసం తానే కృషి చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారన్నారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష కమీషన్ల కోసమే చంద్రబాబు చేస్తున్నారన్నారు. 55 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెబుతున్న చంద్రబాబు పునాదులు దాటి ముందుకు కదలలేదన్న విషయాన్ని దాచిపెడుతున్నారన్నారు. పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. పోలవరం పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శరవేగంగా జరిగాయన్నారు. కాంట్రాక్టర్లతో లెక్కలు తేల్చుకోవడానికే చంద్రబాబు నిత్యం పోలవరాన్ని సందర్శిస్తుంటారని ఎద్దేవా చేశారు. ఇక ఇతర పార్టీల మద్దతు ఇస్తున్న వారికి పింఛన్లు మంజూరు కాకుండా మంత్రి చినరాజప్ప ఫోన్ చేసి మరీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

Similar News