ముద్రగడ జగన్ వ్యాఖ్యలపై ఫైర్ కావడంతో ఆ ప్రభావం జగన్ పాదయాత్రపై చూపింది. నిన్న జగ్గంపేటలో కాపు రిజర్వేషన్ల అమలు కేంద్రం పరిధిలో ఉందని, తాను ఆ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేనని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ముద్రగడ ఫైరయ్యారు. జగన్ కాపులపై సవతి తల్లి ప్రేమ చూపారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఈరోజు జగన్ పాదయాత్ర ముద్రగడ సొంత గ్రామమైన కిర్లంపూడిలోనే జరుగుతోంది. దీంతో కొందరు కాపు యువకులు జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని ఇవ్వాలని నినాదాలు చేశారు. తమను మోసం చేయవద్దంటూ గట్టిగా నినదించారు. దీంతో జగన్ ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళన చేస్తున్న యువకులను పక్కకు నెట్టేశారు. తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది.