వారు చెప్పకపోయినా.. వీరు చెబుతున్నారట

విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం లేదు. 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని వారు భయపడి పోలీసులకు చెప్పడం లేదు. వీరు [more]

Update: 2020-03-29 02:56 GMT

విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం లేదు. 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని వారు భయపడి పోలీసులకు చెప్పడం లేదు. వీరు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి పొరుగు వారు చేరవేస్తున్నారు. ఏపీలో డయల్ 100 కి కాల్ చేసి తమ ప్రాంతానికి ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను చెబుతున్నారు. డయల్ 100కి ఇప్పటికే 320 కాల్స్ వచ్చాయని, విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం తమకు అందిందని, వారు స్వచ్ఖందంగా క్వారంటైన్ లో ఉండాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా గుంటూరు, అమరావతి ప్రాంతంలోనే ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది.

Tags:    

Similar News