ఇద్దరిని అన్యాయంగా చంపేశారే....!

Update: 2018-06-19 06:25 GMT

వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హసన్ పర్తిలో కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా హత్య చేశారు. హసన్ పర్తి మెయిన్ రోడ్డు పక్కనే గడ్డం దామోదర్(65), గడ్డం పద్మ(55) దంపతులు గత కొన్నాళ్లుగా కిరాణం నడుపుతున్నారు. మంగళవారం దుకాణం తెరవకపోవడంతో అనుమానం వచ్చిన పక్కన దుకాణం వారు వచ్చి చూడగా, దంపతులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా నగర పోలీస్ కమిషనర్ రవీందర్, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్దరిపై కారం చల్లి, గొంతు కోసి అతికిరాతకంగా చంపారు. పద్మపై దుండగులు అత్యాచారం జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో బంగారం కూడా పోయినట్లు భావిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Similar News