ఏపీలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించండి

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. కూల్చివేతలు, అరెస్ట్ లపై ఉన్న శ్రద్ధ [more]

Update: 2021-04-28 00:52 GMT

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. కూల్చివేతలు, అరెస్ట్ లపై ఉన్న శ్రద్ధ పాలకులకు కరోనా నియంత్రణపై లేదని ఆయన విమర్శించారు. కరోనా తీవ్రమవుతున్న సమయంలో విద్యార్థులకు పరీక్షలు పెట్టడమేంటని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. జగన్ మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తాను అనుకోవడం లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. ముఖ్యంగా కరోనా రోగులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

Tags:    

Similar News