టీడీపీది ముగిసిన చరిత్ర

పవన్ కల్యాణ్, చంద్రబాబు పన్నాగాలకు, కుట్రలకు బలికావద్దని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు మళ్లీ ఇద్దరూ కలిశారన్నారు. చంద్రబాబుకు సొంత [more]

Update: 2019-10-29 12:07 GMT

పవన్ కల్యాణ్, చంద్రబాబు పన్నాగాలకు, కుట్రలకు బలికావద్దని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు మళ్లీ ఇద్దరూ కలిశారన్నారు. చంద్రబాబుకు సొంత పుత్రుడు లోకేష్ అయితే, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. సొంత పుత్రుడు ఒక నియోజకవర్గంలో ఓటమి పాలయితే, దత్తపుత్రుడు రెండు నియోజకవర్గాల్లో అపజయం పాలయ్యారన్నారు. టీడీపీది ఇక ముగిసిన చరిత్ర అని విజయసాయిరెడ్డి అన్నారు. సుజనా చౌదరి నుంచి వల్లభనేని వంశీ వరకూ పార్టీని వీడిపోతుంటే ఆ పార్టీకి మనుగడ ఎక్కడ ఉందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags:    

Similar News